There are series of religious event which are to take place in the month of August in the famous ancient temple of Lord Sri Govinda Raja Swamy, which happens to be one of the most important sub-shrines under the umbrella of TTD in Tirupati.
Following are special events at Sri Govindaraja Swamy temple in the month of August 2019,
August 1, 2019: Sri Chakrathalwar Shattumora, Sri Prativadi Bhayankar Annan Shattumora.
August 3, 2019: Sri Andal Tiruvadipuram Sattumora
August 4, 2019: Uttara nakshatram procession of Sri Govindaraja Swamy and consorts
August 7, 2019: Adi Swati procession of Sri Govindaraja Swamy
August 9, 2019: Varalakshmi vratam procession of Andal ammavaru
August 12, 2019: Tulasi Mahatya utsava and Garuda vahanam Of Sri Govindaraja Swamy
August 14, 2019: Sravana nakshatram procession of Sri Kalyana Venkateswara.
August 15, 2019: Sravana Pournami procession of Srivari and Sri Krishna to Kapilathirtha Temple.
August 15,31, 2019: Friday procession of Andal Ammavaru
August 23, 2019: Gokulashtami Asthanam
August 24, 2019: Rohini nakshatram procession of Sri Parthasarathy and consorts
August 26, 2019: Chinna Veedi Utlotsavam
August 27, 2019: Peddaveedi Utlotsavam
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఆగస్టులో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
జూలై 30, తిరుపతి, 2019: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టులో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.
– ఆగస్టు 1న శ్రీ చక్రత్తాళ్వార్ శాత్తుమొర, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణన్ శాత్తుమొర.
– ఆగస్టు 3న శ్రీ ఆండాళ్ తిరువడిపురం శాత్తుమొర సందర్భంగా సాయంత్రం 4 గంటలకు శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారు శ్రీవారి పాదాల మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహిస్తారు. తిరిగి వచ్చే క్రమంలో చిన్నజీయర్స్వామి మఠానికి చేరుకుని ఆస్థానం చేపడతారు.
– ఆగస్టు 4న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు.
– ఆగస్టు 7న ఆడి స్వాతి రోజున సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీగోవిందరాజస్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు.
– ఆగస్టు 9న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
– ఆగస్టు 12న తులసి మహత్యం ఉత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 7 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు గరుడ వాహనంపై దర్శనమిస్తారు.
– ఆగస్టు 14న శ్రవణ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
– ఆగస్టు 15న శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఉదయం 6.30 గంటలకు శ్రీవారు, శ్రీ కృష్ణస్వామివారు కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థానికి వేంచేపు చేస్తారు. తిరిగి సాయంత్రం ఆలయానికి చేరుకుంటారు.
– ఆగస్టు 16, 31వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
– ఆగస్టు 23న గోకులాష్టమి ఆస్థానం.
– ఆగస్టు 24న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.
– ఆగస్టు 26న చిన్నవీధి ఉట్లోత్సవం సందర్భంగా సాయంత్రం 7 గంటలకు శ్రీవారు, శ్రీకృష్ణస్వామివారు మాడ వీధుల్లో భక్తులను కటాక్షిస్తారు.
– ఆగస్టు 27న పెద్దవీధి ఉట్లోత్సవం సందర్భంగా సాయంత్రం 4 గంటలకు శ్రీవారు, శ్రీకృష్ణస్వామివారు మాడ వీధుల్లో భక్తులను కటాక్షిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.