The annual Pavitrotsavams in Sri Konetiraya Swamy temple in Keelapatla will be observed from 21 September to 23 September with Ankurarpanam on September 20.
Temple officials are making necessary arrangements for the temple.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టిటిడికి అనుబంధంగా ఉన్న కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో September 21 నుండి 23వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. September 20న సాయంత్రం ఆచార్యవరణం, సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు.
ఆలయంలో ఏడాది పొడవునా నిర్వహించే కైంకర్యాల్లో తెలియక జరిగిన దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాల్లో మొదటి రోజైన September 21 తేదీన ఉదయం అకల్మష హోమం, రక్షాబంధనం సాయంత్రం పవిత్రప్రతిష్ఠ, హెమం నిర్వహిస్తారు. September 22న రెండో రోజు స్నపనతిరుమంజనం, హోమం, పవిత్ర సమర్పణ, సాయంత్రం హోమం చేపడతారు.
September 23న చివరి రోజు ఉదయం హోమం, సాయంత్రం మహాపూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.